APPSC కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 9 2026

APPSC Current Affairs April 9 2026 featured image

ప్రాముఖ్యత: ఏపీపీఎస్సీ (APPSC) – ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం (పర్యాటకం, పెట్టుబడులు, సంస్కృతి, ప్రాంతీయ అభివృద్ధి)

ప్రిలిమ్స్, మెయిన్స్ కోసం ముఖ్యమైన పదాలు (Important Keywords)

ప్రిలిమ్స్ కోసం:

  • అమరావతి రాజధాని ప్రాంతం (Amaravati Capital Region), కందుల దుర్గేష్, HICSA (ముంబై), స్టోరీ టెల్లింగ్ కారిడార్ (Storytelling Corridor), అమరావతి-విశాఖపట్నం-తిరుపతి కారిడార్ (Amaravati–Visakhapatnam–Tirupati Corridor), ఈరోస్ ఇంటర్నేషనల్ (Eros International), రెడ్ బుల్ (Red Bull), ఇమ్మర్సివ్ టూరిజం (Immersive Tourism).

మెయిన్స్ కోసం:

  • ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక సర్క్యూట్‌లు (Tourism Circuits), అమరావతి అభివృద్ధి నమూనా (Amaravati Development Model), సాంస్కృతిక పర్యాటకం (Cultural Tourism), పర్యాటకంలో ప్రైవేట్ పెట్టుబడులు (Private Investment in Tourism), ప్రాంతీయ అనుసంధానం (Regional Connectivity), అనుభవాత్మక పర్యాటకం (Experience-based Tourism).

వార్తల్లో ఎందుకు ఉంది? (Why in News?)

అమరావతిని పర్యాటకం, సాంస్కృతిక సమ్మేళనం, ప్రైవేట్ పెట్టుబడులపై దృష్టితో “గ్లోబల్ క్రియేటివ్ ఎకానమీ హబ్” (Global Creative Economy Hub) గా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించింది.

నేపథ్యం (Background)

  • ప్రణాళికాబద్ధమైన పట్టణాభివృద్ధిపై (Urban growth) దృష్టి పెడుతూ అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అభివృద్ధి చేస్తున్నారు.
  • అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం.. విశాఖపట్నం (తీరప్రాంత పర్యాటకం), తిరుపతి (ఆధ్యాత్మిక పర్యాటకం), అమరావతి (సాంస్కృతిక, వారసత్వ పర్యాటకం) లాంటి ప్రధాన కేంద్రాల ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది.
  • ఈ కేంద్రాలను విడివిడిగా (Isolated destinations) కాకుండా, వాటన్నింటినీ ఒక క్రమబద్ధమైన పర్యాటక నమూనాగా (Structured tourism model) అనుసంధానించాలనే (Connect) ప్రభుత్వ ప్రయత్నాన్ని ప్రస్తుత ప్రతిపాదన ప్రతిబింబిస్తోంది.

అమరావతి: చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత (Historical and Cultural Significance)

  • శాతవాహనుల కాలంలో అమరావతి బౌద్ధమతానికి (Buddhism) ఒక ప్రముఖ కేంద్రంగా ఉండేది. ఇది అమరావతి స్థూపానికి (Amaravati Stupa) ప్రసిద్ధి చెందింది.
  • భారతదేశంలోని ప్రధాన బౌద్ధ స్మారక కట్టడాలలో (Buddhist monuments) ఇది ఒకటి.
  • ఈ ప్రాంతం బౌద్ధమతంలోని మహాయాన సంప్రదాయంతో (Mahayana tradition) ముడిపడి ఉంది. విశిష్టమైన శిల్పకళా శైలిని (Sculptural styles) అభివృద్ధి చేసిన “అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్” (Amaravati School of Art) కు కూడా ఇది ప్రసిద్ధి చెందింది.
  • కృష్ణా నది (Krishna River) ఒడ్డున ఉన్న అమరావతి చారిత్రాత్మకంగా వాణిజ్య, సాంస్కృతిక మార్పిడికి ముఖ్యమైన కేంద్రంగా ఉండేది.

కీలక పరిణామాలు (Key Developments)

  • ముంబైలో జరిగిన హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఆసియా (HICSA) సదస్సులో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ ప్రతిపాదనను సమర్పించారు.
  • సంస్కృతి (Culture), పర్యాటకం (Tourism), డిజిటల్ కంటెంట్‌ను (Digital content) ఏకం చేసే హబ్‌గా అమరావతిని అభివృద్ధి చేయాలని రాష్ట్రం యోచిస్తోంది.
  • ఇందులో ప్రధానంగా ఈ మూడు ప్రాంతాలను కలుపుతూ ప్రతిపాదించిన “స్టోరీ టెల్లింగ్ కారిడార్” (Storytelling Corridor) ముఖ్యాంశం:
    1. అమరావతి
    2. విశాఖపట్నం
    3. తిరుపతి
  • క్రమబద్ధమైన పర్యాటక అనుభవాల ద్వారా (Structured tourism experiences) ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ప్రాంతీయ గుర్తింపును చాటి చెప్పడం ఈ కారిడార్ ఉద్దేశం.
  • డిజిటల్ కంటెంట్ సృష్టి (Content creation), ప్రాంతాల వారీగా పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం (Destination-based promotion) ఈరోస్ ఇంటర్నేషనల్ (Eros International), రెడ్ బుల్ (Red Bull) సంస్థలతో కూడా ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక నమూనా (Tourism Model in AP)

ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలోని మూడు ప్రధాన పర్యాటక కేంద్రాలను (Tourism anchors) ఒకే కారిడార్‌గా (Single corridor) కలుపుతుంది:

  1. అమరావతి: సాంస్కృతిక, పరిపాలనా కేంద్రం (బౌద్ధ వారసత్వం + రాజధాని ప్రాంతం).
  2. విశాఖపట్నం: తీరప్రాంత, నౌకాశ్రయ ఆధారిత, పట్టణ పర్యాటక కేంద్రం.
  3. తిరుపతి: ప్రధాన పుణ్యక్షేత్రం (శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం).
  • వివిధ రకాలైన పర్యాటకాలను (సాంస్కృతిక, తీరప్రాంత, ఆధ్యాత్మిక) ఏకం చేసే కారిడార్-ఆధారిత పర్యాటక నమూనాను (Corridor-based tourism model) ఇది సూచిస్తుంది.

అమరావతి కళారూపం (Amravati School of Art)

  • అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ (Amaravati School of Art).. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి ప్రాంతంలో అభివృద్ధి చెందింది.
  • ఇది ప్రధానంగా శాతవాహన వంశ (Satavahana dynasty) కాలంలో (సుమారు క్రీ.పూ 2వ శతాబ్దం నుండి క్రీ.శ 3వ శతాబ్దం వరకు) విలసిల్లింది. ఇది ప్రాచీన భారతీయ శిల్పకళలో (Ancient Indian sculpture) అత్యంత ముఖ్యమైన కళా పాఠశాలల్లో ఒకటి. ఇది బౌద్ధ కళ, వాస్తుశిల్పంతో (Buddhist art and architecture) దగ్గరి సంబంధం కలిగి ఉంది.

ఆర్థిక వ్యవస్థ, ఉపాధి (Economic and Employment)

  • ఈ కారిడార్ విధానం.. అమరావతి, విశాఖపట్నం, తిరుపతి మధ్య కనెక్టివిటీని (Connectivity), రవాణాను మెరుగుపరుస్తుంది. తద్వారా రాష్ట్రంలో పర్యాటకుల సంచారం (Tourist circulation) పెరుగుతుంది.
  • ఈరోస్ ఇంటర్నేషనల్, రెడ్ బుల్ లాంటి ప్రైవేట్ సంస్థల (Private players) భాగస్వామ్యం.. రాష్ట్రంలోని పర్యాటకం, మీడియా, ఈవెంట్ సంబంధిత కార్యక్రమాల్లోకి పెట్టుబడులు తీసుకురావాలన్న ప్రయత్నాలను చూపుతోంది.
  • స్టోరీ టెల్లింగ్ ఆధారిత పర్యాటకాన్ని (Storytelling-based tourism) అభివృద్ధి చేయడం ద్వారా కింది రంగాల్లో అవకాశాలు పెరుగుతాయి:
    • పర్యాటక సేవలు (Tourism services)
    • సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural events)
    • రాష్ట్ర వారసత్వానికి సంబంధించిన డిజిటల్ కంటెంట్ తయారీ (Digital content production)

ప్రాముఖ్యత (Significance)

  • ఈ చొరవ.. అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా, ఒక సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా (Cultural and tourism centre) నిలబెట్టి దాని పాత్రను బలోపేతం చేస్తుంది.
  • ఇది ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రధాన ప్రాంతాలను ఒకే పర్యాటక కారిడార్‌లోకి (Tourism corridor) అనుసంధానించి, ప్రాంతీయ సమతుల్యతను (Regional balance) మెరుగుపరుస్తుంది.
  • ఆధ్యాత్మిక, తీరప్రాంత, సాంస్కృతిక పర్యాటకాన్ని మిళితం చేస్తూ సమీకృత పర్యాటకాభివృద్ధి (Integrated tourism development) వైపు రాష్ట్రం అడుగులు వేయడాన్ని ఇది తెలియజేస్తుంది.
  • ప్రైవేట్ భాగస్వామ్యానికి (Private participation) ఇస్తున్న ప్రాముఖ్యత.. పెట్టుబడుల ఆధారిత (Investment-driven) పర్యాటక అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని హైలైట్ చేస్తుంది.

సవాళ్లు (Challenges)

  • బహుళ ప్రాంతాల మధ్య (అమరావతి-విశాఖపట్నం-తిరుపతి) సమన్వయం (Coordination) తీసుకురావడం ఒక సవాలు.
  • కారిడార్ పొడవునా పర్యాటకులకు అనువైన మౌలిక సదుపాయాలను (Supporting infrastructure) అభివృద్ధి చేయాలి.
  • పర్యాటక రంగంలో ఆధునిక సాంకేతికతను (Advanced technologies) అమలు చేయాల్సి ఉంది.
  • సాంస్కృతిక ప్రదర్శనలు సహజత్వాన్ని (Authentic) కోల్పోకుండా, ప్రామాణికంగా ఉండేలా చూసుకోవాలి.

ముందున్న మార్గం (Way Forward)

  • కారిడార్ వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కనెక్టివిటీని (Infrastructure connectivity) బలోపేతం చేయాలి.
  • పర్యాటక అభివృద్ధి కోసం ప్రైవేట్ కంపెనీలతో భాగస్వామ్యాలను (Partnerships) ప్రోత్సహించాలి.
  • పర్యాటక, సాంస్కృతిక రంగాలలో నైపుణ్య ఆధారిత శిక్షణను (Skill-based training) అభివృద్ధి చేయాలి.
  • మూడు ప్రాంతాలు సమతుల్యంగా అభివృద్ధి చెందేలా (Balanced development) చూడాలి.

కేర్ (CARE) బహుళైచ్ఛిక ప్రశ్నలు (MCQs)

ప్రశ్న 1: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదించిన “స్టోరీ టెల్లింగ్ కారిడార్” (Storytelling Corridor) కి సంబంధించి, కింది వాక్యాలను పరిశీలించండి:

  1. ఇది అమరావతి, విశాఖపట్నం, తిరుపతి నగరాలను కలుపుతుంది.
  2. డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించి సాంస్కృతిక, ఆధ్యాత్మిక పర్యాటకాన్ని ఏకం చేయడంపై ఇది దృష్టి పెడుతుంది.
  3. ఇందులో ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యాన్ని (Participation of private companies) పూర్తిగా మినహాయించారు.

పై వాక్యాలలో ఏవి సరైనవి?

A. 1, 2 మాత్రమే

B. 2, 3 మాత్రమే

C. 1, 3 మాత్రమే

D. 1, 2, 3

జవాబు: A

వివరణ:

  • 1వ వాక్యం సరైనది: ఈ కారిడార్ రాష్ట్రంలోని అమరావతి, విశాఖపట్నం, తిరుపతి నగరాలను అనుసంధానిస్తుంది.
  • 2వ వాక్యం సరైనది: డిజిటల్ టెక్నాలజీల ద్వారా (Technology-based tourism) అనుభవాత్మక, సాంస్కృతిక పర్యాటకాన్ని అందించడం దీని లక్ష్యం.
  • 3వ వాక్యం తప్పు: పర్యాటక అభివృద్ధిలో ప్రైవేట్ భాగస్వామ్యం ఉంది. ఈరోస్ ఇంటర్నేషనల్ (Eros International), రెడ్ బుల్ (Red Bull) లాంటి సంస్థలతో ప్రభుత్వం కలిసి పనిచేస్తోంది.

ప్రశ్న 2: అమరావతికి సంబంధించి, కింది వాక్యాలను పరిశీలించండి:

  1. శాతవాహనుల కాలంలో ఇది బౌద్ధమతానికి (Buddhism) ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉండేది.
  2. ఇది గోదావరి నది ఒడ్డున ఉంది.
  3. ఇది ‘అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్’ (Amaravati School of Art) తో సంబంధం కలిగి ఉంది.

పై వాక్యాలలో ఏవి సరైనవి?

A. 1, 3 మాత్రమే

B. 2, 3 మాత్రమే

C. 1, 2 మాత్రమే

D. 1, 2, 3

జవాబు: A

వివరణ:

  • 1వ వాక్యం సరైనది: శాతవాహనుల కాలంలో అమరావతి ఒక ప్రధాన బౌద్ధ కేంద్రంగా విలసిల్లింది. వీరు బౌద్ధ సంస్థలకు మద్దతు ఇచ్చారు, స్థూపాలను నిర్మించారు.
  • 2వ వాక్యం తప్పు: అమరావతి కృష్ణా నది ఒడ్డున ఉంది, గోదావరి నది ఒడ్డున కాదు.
  • 3వ వాక్యం సరైనది: బౌద్ధమత కథల (Narrative sculptures) చెక్కడాలకు ప్రసిద్ధి చెందిన ‘అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్’ పుట్టింది ఇక్కడే.

ప్రశ్న 3: అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ (Amaravati School of Art) కి సంబంధించి, కింది వాక్యాలను పరిశీలించండి:

  1. ఇది ప్రధానంగా శిల్పాల కోసం తెల్లటి సున్నపురాయిని (White limestone) వాడింది.
  2. గాంధార కళ (Gandhara art) మాదిరిగానే ఇది కూడా గ్రీకో-రోమన్ (Greco-Roman) ప్రభావాన్ని బలంగా చూపుతుంది.
  3. ఇది జాతక కథల (Jataka stories) చిత్రణలను (Narrative panels) వర్ణిస్తుంది.

పై వాక్యాలలో ఏవి సరైనవి?

A. 1, 3 మాత్రమే

B. 2, 3 మాత్రమే

C. 1, 2 మాత్రమే

D. 1, 2, 3

జవాబు: A

వివరణ:

  • 1వ వాక్యం సరైనది: తెల్లటి సున్నపురాయి వాడటం అనేది అమరావతి కళ యొక్క ప్రధాన లక్షణం.
  • 2వ వాక్యం తప్పు: గ్రీకో-రోమన్ ప్రభావం అనేది గాంధార స్కూల్ (Gandhara School) కళలో కనిపిస్తుంది, అమరావతి కళలో కాదు. అమరావతి అనేది పూర్తిగా స్వదేశీ కళ (Indigenous).
  • 3వ వాక్యం సరైనది: అమరావతి శిల్పాలు జాతక కథలను, బుద్ధుని జీవిత ఘట్టాలను వరుస క్రమంలో (Narrative panels) వివరిస్తాయి.

ప్రశ్న 4: కింది జతలను పరిశీలించండి:

బౌద్ధ క్షేత్రం (Buddhist Site)సంబంధించిన లక్షణం (Associated Feature)
1. అమరావతిమహాయాన ప్రభావం (Mahayana influence)
2. నాగార్జునకొండఇక్ష్వాకుల పోషణ (Ikshvaku patronage)
3. శాలిహుండంకృష్ణా నదిపై ఉంది (Located on Krishna River)

పైన ఇచ్చిన జతలలో ఏవి సరిగ్గా సరిపోలాయి (Correctly matched)?

A. 1, 2 మాత్రమే

B. 2, 3 మాత్రమే

C. 1, 3 మాత్రమే

D. 1, 2, 3

జవాబు: A

వివరణ:

  • జత 1 సరైనది: అమరావతిలో, ముఖ్యంగా తరువాతి కాలం నాటి కళాఖండాల్లో మహాయాన బౌద్ధ (Mahayana Buddhist) ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
  • జత 2 సరైనది: నాగార్జునకొండ బౌద్ధమతాన్ని పోషించిన ఇక్ష్వాక వంశ రాజుల (Ikshvaku dynasty) కాలంలో బాగా వర్ధిల్లింది.
  • జత 3 తప్పు: శాలిహుండం (శ్రీకాకుళం జిల్లా) వంశధార నది (Vamsadhara River) సమీపంలో ఉంది, కృష్ణా నది మీద కాదు.

ప్రశ్న 5: నాగార్జునకొండకు సంబంధించి, కింది వాక్యాలను పరిశీలించండి:

  1. ఇది ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధమతానికి ముఖ్యమైన కేంద్రంగా ఉండేది.
  2. బౌద్ధ తత్వవేత్త నాగార్జునుడితో (Nagarjuna) దీనికి సంబంధం ఉంది.
  3. ఇది గోదావరి నదీలోయలో (Godavari River valley) ఉంది.

పై వాక్యాలలో ఏవి సరైనవి?

A. 1, 2 మాత్రమే

B. 2, 3 మాత్రమే

C. 1, 3 మాత్రమే

D. 1, 2, 3

జవాబు: A

వివరణ:

  • 1వ వాక్యం సరైనది: ఇక్ష్వాక పాలకుల కింద నాగార్జునకొండ ఒక ముఖ్యమైన బౌద్ధ కేంద్రంగా విలసిల్లింది.
  • 2వ వాక్యం సరైనది: మహాయాన బౌద్ధమతంలో కీలక వ్యక్తి అయిన నాగార్జునుడితో (Nagarjuna) దీనికి సంబంధం ఉంది.
  • 3వ వాక్యం తప్పు: నాగార్జునకొండ కృష్ణా నదీలోయలో (Krishna River valley) ఉంది, గోదావరి బేసిన్‌లో కాదు.

ప్రశ్న 6: గాంధార స్కూల్ (Gandhara School) నుంచి అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ (Amaravati School of Art) ని వేరు చేసే అంశం ఏది?

A. అమరావతి గ్రే షిస్ట్ (Grey schist) రాయితో చేస్తే, గాంధార కళ తెల్ల సున్నపురాయి (White limestone) తో చేశారు.

B. అమరావతి కళ గ్రీకో-రోమన్ ప్రభావాన్ని చూపితే, గాంధార కళ పూర్తిగా స్వదేశీ (Indigenous) శైలి.

C. అమరావతి కళ తెల్ల సున్నపురాయిని వాడితే, గాంధార కళ గ్రే షిస్ట్ రాయిని వాడింది.

D. రెండు కళలూ ఒకే విధమైన పదార్థాలు, శైలులను (Materials and styles) ఉపయోగించాయి.

జవాబు: C

వివరణ:

  • ఆప్షన్ A తప్పు: రాళ్ల పేర్లను మార్చారు. అమరావతి తెల్ల సున్నపురాయి వాడింది, గాంధార గ్రే షిస్ట్ రాయి వాడింది.
  • ఆప్షన్ B తప్పు: గ్రీకో-రోమన్ ప్రభావం గాంధార కళలో కనిపిస్తుంది, అమరావతి కళలో కాదు.
  • ఆప్షన్ C సరైనది: అమరావతి → తెల్ల సున్నపురాయి (White limestone), గాంధార → గ్రే షిస్ట్ రాయి (Grey schist).
  • ఆప్షన్ D తప్పు: ఈ రెండు పాఠశాలలు (Schools) వాడిన పదార్థాలు, శైలి, ప్రభావం అన్నీ వేర్వేరు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ప్ర1. అమరావతిని గ్లోబల్ క్రియేటివ్ ఎకానమీ హబ్‌గా ఎందుకు అభివృద్ధి చేస్తున్నారు?

జ: సంస్కృతి, పర్యాటకం, డిజిటల్ మీడియా, సృజనాత్మక పరిశ్రమల (Creative industries) కోసం అమరావతిని ఒక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడం, వారసత్వ పర్యాటకాన్ని (Heritage tourism) ప్రోత్సహించడం, ఉపాధి సృష్టించడం దీని ప్రధాన లక్ష్యం.

ప్ర2. ఆంధ్రప్రదేశ్ పర్యాటకంలో “స్టోరీ టెల్లింగ్ కారిడార్” (Storytelling Corridor) అంటే ఏమిటి?

జ: అమరావతి, విశాఖపట్నం, తిరుపతి అనే మూడు ప్రధాన నగరాలను కలిపే పర్యాటక చొరవ ఇది. అద్భుతమైన పర్యాటక అనుభవాల ద్వారా రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ప్రాంతీయ గుర్తింపును ప్రపంచానికి చాటి చెప్పడం దీని లక్ష్యం.

ప్ర3. బౌద్ధమతంలో అమరావతికి చారిత్రక ప్రాముఖ్యత ఉందా?

జ: అవును. శాతవాహనుల కాలంలో అమరావతి ఒక ప్రధాన బౌద్ధ కేంద్రం, అలాగే అమరావతి స్థూపానికి ప్రసిద్ధి చెందింది. ఇది బౌద్ధుల విద్య (Learning), కళ (Art), వాణిజ్యానికి ఒక ముఖ్యమైన కేంద్రంగా మారింది.

ప్ర4. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ దేనిని సూచిస్తుంది?

జ: అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది క్రీ.పూ 2వ శతాబ్దం నుంచి క్రీ.శ 3వ శతాబ్దం మధ్య అభివృద్ధి చెందిన ఒక ప్రాచీన భారతీయ శిల్పకళా పాఠశాల. బౌద్ధ కథలను (Buddhist stories) తెలిపే తెల్లటి సున్నపురాయి (White limestone) శిల్పాలకు ఇది చాలా ప్రసిద్ధి చెందింది.

ప్ర5. అమరావతి టూరిజం ప్రాజెక్ట్‌లో ప్రైవేట్ కంపెనీల పాత్ర ఏమిటి?

జ: కంటెంట్ క్రియేషన్ (Content creation), ఈవెంట్‌లు నిర్వహించడం, పర్యాటక బ్రాండింగ్‌ను (Destination branding) ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఈరోస్ ఇంటర్నేషనల్, రెడ్ బుల్ లాంటి ప్రైవేట్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది.

Source: The Hindu

ప్రాముఖ్యత: జనరల్ స్టడీస్ పేపర్ II – పాలన, రాజ్యాంగం, మానవ హక్కులు

ప్రిలిమ్స్, మెయిన్స్ కోసం ముఖ్యమైన పదాలు (Important Keywords)

ప్రిలిమ్స్ కోసం:

  • కస్టోడియల్ మరణం, ఆర్టికల్ 21, పోలీస్ కస్టడీ, జ్యుడీషియల్ కస్టడీ, NHRC (జాతీయ మానవ హక్కుల కమిషన్), UNCAT (హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్).

మెయిన్స్ కోసం:

  • జీవించే హక్కు మరియు గౌరవం, కస్టోడియల్ హింస, చట్టబద్ధమైన పాలన (రూల్ ఆఫ్ లా), పోలీసు సంస్కరణలు, సంస్థాగత జవాబుదారీతనం, చట్టబద్ధమైన ప్రక్రియ (డ్యూ ప్రాసెస్).

వార్తల్లో ఎందుకు ఉంది? (Why in News?)

  • తమిళనాడులోని ఒక ట్రయల్ కోర్టు 2020లో జరిగిన సాత్తన్‌కుళం కస్టోడియల్ మర్డర్ కేసులో తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధించింది.
  • ఈ తీర్పు కస్టోడియల్ హింసను “అరుదులోకెల్లా అత్యంత అరుదైన (rarest of rare)” నేరంగా అభివర్ణించింది. ప్రభుత్వ అధికార దుర్వినియోగం యొక్క తీవ్రతను ఇది ఎత్తిచూపింది.
  • న్యాయపరమైన రక్షణలు, రాజ్యాంగపరమైన భద్రతలు ఉన్నప్పటికీ పదేపదే జరుగుతున్న కస్టోడియల్ మరణాల గురించి ఈ కేసు మరోసారి ఆందోళనలను రేకెత్తించింది.
  • కస్టోడియల్ హింసను నివారించడంలో ప్రస్తుతం ఉన్న చట్టపరమైన యంత్రాంగాల సమర్థతపై ఇది ఒక విస్తృతమైన పాలనాపరమైన ప్రశ్నను లేవనెత్తింది.

నేపథ్యం మరియు సందర్భం (Background and Context)

  • రాజ్యాంగపరమైన హామీలు మరియు పదేపదే న్యాయస్థానాల జోక్యాలు ఉన్నప్పటికీ భారతదేశంలో కస్టోడియల్ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి.
  • మన పోలీసు వ్యవస్థ ఇంకా వలసవాద కాలం నాటి పద్ధతులను కొనసాగిస్తోంది. ఇది హక్కుల ఆధారిత దర్యాప్తు కంటే బలవంతపు పద్ధతుల (coercion) పైనే ఎక్కువగా ఆధారపడుతోంది.
  • జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) వంటి పర్యవేక్షణ సంస్థలు ఉన్నప్పటికీ, నిర్మాణాత్మక పరిమితుల కారణంగా వాటి అమలు బలహీనంగానే ఉంది.
  • ప్రత్యేకమైన హింస వ్యతిరేక చట్టం (anti-torture law) లేకపోవడం జవాబుదారీతనాన్ని మరింత బలహీనపరుస్తోంది. తత్ఫలితంగా, కస్టోడియల్ హింస అనేది ఎక్కడో అరుదుగా జరిగే సంఘటనల కంటే వ్యవస్థాగత పాలనా వైఫల్యాన్ని (systemic governance failure) ప్రతిబింబిస్తుంది.

కస్టోడియల్ మరణం భావన (Concept of Custodial Death)

పోలీసు లేదా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు హింస, మితిమీరిన బలప్రయోగం లేదా నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి మరణించడాన్ని ‘కస్టోడియల్ మరణం’ అంటారు. పోలీస్ కస్టడీ మరణాలు సాధారణంగా విచారణ (interrogation) సమయంలో సంభవిస్తాయి, అయితే జ్యుడీషియల్ కస్టడీ మరణాలు జైళ్లలో అధ్వాన్నమైన పరిస్థితులు లేదా హింస కారణంగా జరుగుతాయి. ఇలాంటి సంఘటనలు ప్రాథమిక హక్కుల ప్రత్యక్ష ఉల్లంఘనను సూచిస్తాయి మరియు ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని సూచిస్తాయి. ప్రభుత్వం తన నియంత్రణలో ఉన్న వ్యక్తులను రక్షించాలి కానీ వారికి హాని చేయకూడదు అనే ప్రాథమిక సూత్రాన్ని ఇవి దెబ్బతీస్తాయి.

కస్టోడియల్ మరణాల రకాలు: కస్టోడియల్ మరణాలు ప్రధానంగా రెండు రకాలు:

  1. పోలీస్ కస్టడీ మరణం (Police Custody Death): విచారణ లేదా దర్యాప్తు సమయంలో పోలీస్ స్టేషన్ లేదా లాకప్‌లో పోలీసుల అదుపులో ఉన్నప్పుడు వ్యక్తి మరణించడం.
  2. జ్యుడీషియల్ కస్టడీ మరణం (Judicial Custody Death): కోర్టు ఆదేశాల మేరకు ఒక వ్యక్తిని జైలు లేదా కారాగారంలో ఉంచినప్పుడు మరణించడం.

రాజ్యాంగ చట్రం – ఆర్టికల్ 21 (Constitutional Framework)

  • రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, చట్టం ద్వారా నిర్దేశించబడిన విధానం (procedure established by law) ప్రకారం తప్ప, ఏ వ్యక్తి యొక్క ప్రాణాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను హరించరాదు.
  • కాలక్రమేణా, సుప్రీంకోర్టు దీని పరిధిని విస్తరించి.. గౌరవంగా జీవించే హక్కు, హింసకు వ్యతిరేకంగా రక్షణ మరియు కస్టడీలో మానవతా దృక్పథంతో వ్యవహరించడం లాంటి వాటిని ఆర్టికల్ 21లో చేర్చింది.
  • మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, చట్టపరమైన ప్రక్రియ న్యాయంగా, సమంజసంగా ఉండాలని కోర్టు పేర్కొంది. తద్వారా ఆర్టికల్ 21 ను ‘సబ్‌స్టాంటివ్ డ్యూ ప్రాసెస్’ హామీగా విస్తరించింది.
  • నీలాబతి బెహరా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒడిశా కేసులో, కస్టోడియల్ మరణాలకు బాధితులకు నష్టపరిహారం చెల్లించే బాధ్యత ప్రభుత్వానిదే అని కోర్టు నిర్ధారించింది, దీనిని ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా గుర్తించింది.
  • జోగిందర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో, అరెస్టు ఏకపక్షంగా ఉండకూడదని, ప్రక్రియపరమైన భద్రతలను తప్పక పాటించాలని కోర్టు నొక్కిచెప్పింది.
  • ఈ తీర్పులన్నీ సమిష్టిగా.. కస్టోడియల్ హింస అనేది జీవించే హక్కు మరియు గౌరవానికి (right to life and dignity) ప్రత్యక్ష ఉల్లంఘన అని నిర్ధారిస్తాయి.

డేటా మరియు పోకడలు (Data and Trends)

  • 2025-26లో భారతదేశంలో దాదాపు 170 కస్టోడియల్ మరణాలు నమోదయ్యాయి, ఇది ఈ సమస్య ఇంకా కొనసాగుతోందని ప్రతిబింబిస్తోంది.
  • గత ఐదేళ్లుగా ఈ గణాంకాలు స్థిరంగా ఎక్కువగా ఉన్నాయి, ఇవి విడిగా జరిగే సంఘటనల కంటే వ్యవస్థాగత సమస్యను (systemic issue) సూచిస్తున్నాయి.
  • బీహార్ మరియు రాజస్థాన్ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఇది పాలనాపరమైన అసమానతలను ఎత్తిచూపుతోంది.
  • ఇలా ఉన్నప్పటికీ, ఇందులో జవాబుదారీతనం అతి తక్కువగానే ఉంది. శిక్ష లేదా క్రమశిక్షణా చర్యలకు దారితీసే కేసులు బహుశా తక్కువగానే ఉంటున్నాయి.

ఇమిడి ఉన్న ప్రధాన సమస్యలు (Core Issues Involved)

  • కస్టోడియల్ మరణాల కొనసాగింపు.. ప్రధానంగా పోలీసు వ్యవస్థలోని నిర్మాణాత్మక బలహీనతలతో ముడిపడి ఉంది.
  • ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల నేరాలను నిరూపించడానికి బలవంతపు విచారణ పద్ధతులపై ఆధారపడటం ఎక్కువగా ఉంది.
  • సంస్థాగత సంస్కృతి (Institutional culture) తరచుగా తప్పు చేసిన అధికారులను కాపాడుతుంది. ఇది శిక్ష పడదు అనే ధీమాను (culture of impunity) సృష్టిస్తుంది.
  • నిర్దిష్ట హింస వ్యతిరేక చట్టం (anti-torture law) లేకపోవడం, ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ (UNCAT)ను ఆమోదించకపోవడం వంటి చట్టపరమైన లోపాలు జవాబుదారీతనాన్ని బలహీనపరుస్తాయి.
  • ప్రాసిక్యూషన్ (విచారణ) కు ముందు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి (prior sanction) వంటి ప్రక్రియపరమైన అడ్డంకులు న్యాయాన్ని మరింత ఆలస్యం చేస్తాయి.

న్యాయపరమైన రక్షణలు (Judicial Safeguards)

కస్టోడియల్ హింసను నివారించడానికి సుప్రీంకోర్టు అనేక భద్రతలను నిర్దేశించింది.

  • డి.కె. బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో, అరెస్టు మరియు నిర్బంధానికి సంబంధించిన మార్గదర్శకాలు స్థాపించబడ్డాయి. ఇందులో తప్పనిసరి వైద్య పరీక్షలు, అరెస్ట్ గురించి బంధువులకు సమాచారం ఇవ్వడం వంటివి ఉన్నాయి.
  • ప్రకాష్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి ‘పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ’ల ఏర్పాటు వంటి సంస్కరణలు తప్పనిసరి చేయబడ్డాయి.
  • పరమవీర్ సింగ్ సైనీ వర్సెస్ బల్జీత్ సింగ్ కేసులో, పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం తప్పనిసరి చేయబడింది.
  • అయితే, వీటి బలహీనమైన అమలు.. వాటి ప్రభావాన్ని పరిమితం చేస్తూనే ఉంది.

పరిణామాలు / ప్రభావాలు (Implications)

  • కస్టోడియల్ మరణాలు చట్ట అమలు సంస్థల (law enforcement agencies) పట్ల ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడం ద్వారా చట్టబద్ధమైన పాలన (రూల్ ఆఫ్ లా) ను నిర్వీర్యం చేస్తాయి.
  • ఇవి అణగారిన వర్గాలను (marginalized communities) అసమానంగా ప్రభావితం చేస్తాయి. సామాజిక అసమానతలను మరింత బలపరుస్తాయి.
  • అలాంటి సంఘటనలు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ మానవ హక్కుల కీర్తిని కూడా దెబ్బతీస్తాయి.
  • అంతేకాకుండా, చట్టబద్ధమైన ప్రక్రియ (due process) కంటే బలవంతపు పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా ఇవి క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను (criminal justice system) బలహీనపరుస్తాయి.

సవాళ్లు / విమర్శలు (Challenges / Criticisms)

  • రక్షణలు తరచుగా సమర్థవంతంగా అమలు కాకపోవడంతో అమలులోని అంతరాలు (Implementation gaps) ఒక ప్రధాన ఆందోళనగా మిగిలిపోయాయి.
  • విచారణకు ముందు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి వంటి చట్టపరమైన నిబంధనలు అధికారుల జవాబుదారీతనాన్ని ఆలస్యం చేస్తాయి.
  • దర్యాప్తులు తరచుగా సుదీర్ఘంగా సాగుతాయి, ఇది ముఖ్యమైన సాక్ష్యాలు కోల్పోవడానికి దారితీస్తుంది.
  • స్వతంత్ర పర్యవేక్షణ (independent oversight) లేకపోవడం వల్ల సంస్థాగత పక్షపాతం కొనసాగడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
  • అదనంగా, జైళ్లలో ఖైదీల రద్దీ (prison overcrowding) జ్యుడీషియల్ కస్టడీలో మరణాలకు దోహదం చేస్తుంది.

ముందున్న మార్గం (Way Forward)

  • చట్టపరమైన చట్రాన్ని బలోపేతం చేయడానికి భారతదేశం సమగ్రమైన హింస వ్యతిరేక చట్టాన్ని (anti-torture law) తీసుకురావాలి మరియు UNCAT ను ఆమోదించాలి.
  • దర్యాప్తులు ఫోరెన్సిక్ మరియు సాక్ష్యాల ఆధారిత (evidence-based) పద్ధతుల వైపు మళ్లాలి.
  • నిష్పాక్షికతను నిర్ధారించడానికి కస్టోడియల్ మరణాల కేసులను స్వతంత్ర సంస్థలు విచారించాలి.
  • సీసీటీవీల ఏర్పాటు నిబంధనలతో సహా జవాబుదారీ యంత్రాంగాల కఠినమైన అమలు అత్యవసరం.
  • దీర్ఘకాలిక మార్పు కోసం శిక్షణ, మానవ హక్కుల అవగాహన, సంస్థాగత పునర్నిర్మాణంపై దృష్టి సారించే పోలీసు సంస్కరణలు అవసరం.

ముగింపు (Conclusion)

సాత్తన్‌కుళం తీర్పు కస్టోడియల్ హింస పట్ల బలమైన న్యాయపరమైన ప్రతిస్పందనను ప్రతిబింబిస్తుంది. అయితే, వ్యవస్థాగత సంస్కరణలు మాత్రం అత్యంత ఆవశ్యకం. ఆర్టికల్ 21ని రక్షించాలంటే నేరస్థులకు శిక్ష విధించడం మాత్రమే కాకుండా, పోలీసుల పద్ధతులలో సమూల మార్పు (transformation) తీసుకురావాలి. రాజ్యాంగ విలువలను మరియు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడానికి చట్ట అమలులో హక్కుల ఆధారిత విధానం (rights-based approach) కీలకం.

యూపీఎస్సీ గత సంవత్సరాల ప్రశ్న (UPSC PYQ)

ప్ర. భారతదేశంలో కస్టోడియల్ హింస నుండి వ్యక్తులను రక్షించడంలో ఆర్టికల్ 21 పాత్రను చర్చించండి. (250 పదాలు)

కేర్ (CARE) బహుళైచ్ఛిక ప్రశ్నలు (MCQs)

ప్రశ్న 1: భారతదేశంలో కస్టోడియల్ మరణాలకు (Custodial death) సంబంధించి కింది వాక్యాలను పరిగణించండి:

  1. పోలీసు, జ్యుడీషియల్ లేదా ఇతర చట్ట అమలు సంస్థల అదుపులో ఉన్నప్పుడు ఒక వ్యక్తి మరణించడాన్ని కస్టోడియల్ మరణం అంటారు.
  2. భారత రాజ్యాంగం ప్రకారం కస్టోడియల్ మరణాలను ‘జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ’ (Right to life and personal liberty) ఉల్లంఘనలుగా పరిగణిస్తారు.

కింద ఇచ్చిన కోడ్‌ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

A. 1 మాత్రమే

B. 2 మాత్రమే

C. 1 మరియు 2

D. 1 లేదా 2 ఏదీ కాదు

సమాధానం: C

వివరణ:

  • వాక్యం 1 సరైనది: పోలీసు, జైలు అధికారులు లేదా ఇతర చట్ట అమలు సంస్థల అదుపులో (కస్టడీలో) లేదా వారి నియంత్రణలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి మరణిస్తే దానిని కస్టోడియల్ మరణం అంటారు.
  • వాక్యం 2 సరైనది: అలాంటి మరణాలు సహజమైనవని లేదా నిర్లక్ష్యం, హింస కారణంగా జరగలేదని నిరూపిస్తే తప్ప, వాటిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ) ఉల్లంఘనలుగానే పరిగణిస్తారు.

ప్రశ్న 2: భారతదేశంలో కస్టోడియల్ హింసకు (Custodial torture) వ్యతిరేకంగా ఉన్న చట్టపరమైన రక్షణలకు సంబంధించి కింది వాక్యాలను పరిగణించండి:

  1. రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) ఒక నిందితుడు తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పమని బలవంతపెట్టబడకుండా రక్షిస్తుంది.
  2. ఆర్టికల్ 22 అరెస్టు మరియు నిర్బంధానికి (detention) సంబంధించిన రక్షణలను అందిస్తుంది.

కింద ఇచ్చిన కోడ్‌ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

A. 1 మాత్రమే

B. 2 మాత్రమే

C. 1 మరియు 2

D. 1 లేదా 2 ఏదీ కాదు

సమాధానం: C

వివరణ:

  • వాక్యం 1 సరైనది: ఆర్టికల్ 20(3) వ్యక్తులను స్వయంగా నేరం అంగీకరించకుండా రక్షిస్తుంది, విచారణ సమయంలో బలవంతంగా నేరాంగీకారం చేయించడాన్ని నివారిస్తుంది.
  • వాక్యం 2 సరైనది: ఆర్టికల్ 22 కొన్ని రక్షణలను హామీ ఇస్తుంది. అరెస్టుకు గల కారణాలను తెలియజేయడం, న్యాయవాదిని సంప్రదించే హక్కు లాంటివి ఇందులో ఉన్నాయి. కస్టోడియల్ దుర్వినియోగం మరియు హింసను నివారించడమే ఈ నిబంధనల ఉమ్మడి లక్ష్యం.

ప్రశ్న 3: కస్టోడియల్ మరణాలలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) పాత్రకు సంబంధించి కింది వాక్యాలను పరిగణించండి:

  1. సంబంధిత అధికారులు అన్ని కస్టోడియల్ మరణాల కేసులను తప్పనిసరిగా NHRCకి నివేదించాలి.
  2. కస్టోడియల్ మరణాలకు కారణమైన పోలీసు అధికారులకు నేరుగా శిక్ష విధించే అధికారం NHRCకి ఉంది.

కింద ఇచ్చిన కోడ్‌ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

A. 1 మాత్రమే

B. 2 మాత్రమే

C. 1 మరియు 2

D. 1 లేదా 2 ఏదీ కాదు

సమాధానం: A

వివరణ:

  • వాక్యం 1 సరైనది: NHRC మార్గదర్శకాల ప్రకారం, పారదర్శకతను మరియు దర్యాప్తును నిర్ధారించడానికి ప్రతి కస్టోడియల్ మరణాన్ని 24 గంటలలోపు నివేదించాలి.
  • వాక్యం 2 తప్పు: NHRC చర్యను లేదా నష్టపరిహారాన్ని సిఫార్సు చేయగలదు, కానీ అది అధికారులకు నేరుగా శిక్ష విధించలేదు. కోర్టులు లేదా క్రమశిక్షణా అధికారుల ద్వారా మాత్రమే శిక్ష అమలు చేయబడుతుంది.

ప్రశ్న 4: కస్టోడియల్ కేసుల్లో న్యాయపరమైన రక్షణలకు (Judicial safeguards) సంబంధించి కింది వాక్యాలను పరిగణించండి:

  1. డి.కె. బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో కస్టోడియల్ హింసను నివారించడానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది.
  2. అరెస్ట్ మెమోను సిద్ధం చేయడం మరియు అరెస్టయిన వ్యక్తి తన బంధువు లేదా స్నేహితుడికి సమాచారం ఇచ్చే హక్కును కలిగి ఉండటం ఈ మార్గదర్శకాల్లో ఉన్నాయి.

కింద ఇచ్చిన కోడ్‌ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

A. 1 మాత్రమే

B. 2 మాత్రమే

C. 1 మరియు 2

D. 1 లేదా 2 ఏదీ కాదు

సమాధానం: C

వివరణ:

  • వాక్యం 1 సరైనది: చారిత్రక తీర్పు డి.కె. బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ (1997) లో, సుప్రీంకోర్టు కస్టోడియల్ దుర్వినియోగాన్ని నివారించడానికి మార్గదర్శకాలను నిర్దేశించింది.
  • వాక్యం 2 సరైనది: ఈ మార్గదర్శకాలలో కిందివి ఉన్నాయి:
    • అరెస్ట్ మెమో
    • బంధువులకు సమాచారం ఇచ్చే హక్కు
    • వైద్య పరీక్ష
    • పోలీసు అధికారుల సరైన గుర్తింపు పోలీస్ కస్టడీలో జవాబుదారీతనాన్ని నిర్ధారించడమే ఈ రక్షణల ఉద్దేశ్యం.

ప్రశ్న 5: నేర శిక్షాస్మృతి (Code of Criminal Procedure – CrPC), 1973 కింద కస్టోడియల్ దుర్వినియోగానికి వ్యతిరేకంగా ఉన్న రక్షణలకు సంబంధించి కింది వాక్యాలను పరిగణించండి:

  1. సెక్షన్ 41(1) కింద అరెస్టు అవసరం లేని సందర్భాల్లో, పోలీసు అధికారి ఆ వ్యక్తిని అరెస్టు చేయడానికి బదులుగా విచారణకు హాజరు కావాలని నోటీసు ఇవ్వవచ్చని సెక్షన్ 41A తప్పనిసరి చేస్తుంది.
  2. ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కొన్ని రకాల నేరాలలో, అరెస్టు చేయడానికి గల కారణాలను అలాగే అరెస్టు చేయకపోవడానికి గల కారణాలను నమోదు చేయాలని సెక్షన్ 41 పోలీసులను కోరుతుంది.
  3. కస్టడీలో మరణించిన ప్రతి కేసులో, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) స్థాయికి తగ్గని పోలీసు అధికారి మాత్రమే దర్యాప్తు చేయాలని సెక్షన్ 176 నిర్దేశిస్తుంది.

కింద ఇచ్చిన కోడ్‌ను ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి:

A. 1 మరియు 2 మాత్రమే

B. 2 మరియు 3 మాత్రమే

C. 1 మరియు 3 మాత్రమే

D. 1, 2 మరియు 3

సమాధానం: A

వివరణ:

  • వాక్యం 1 సరైనది: అనవసరమైన అరెస్టులను తగ్గించడానికి CrPC లో సెక్షన్ 41A ప్రవేశపెట్టబడింది. సెక్షన్ 41 కింద అరెస్టు అవసరం లేకపోతే, నిందితుడిని అరెస్టు చేయడానికి బదులుగా హాజరు నోటీసు జారీ చేయడానికి ఇది పోలీసులను అనుమతిస్తుంది.
  • వాక్యం 2 సరైనది: సవరణలు మరియు కోర్టు తీర్పుల తర్వాత, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి మరియు ఏకపక్ష అరెస్టులను నిరోధించడానికి సెక్షన్ 41 పోలీసులను ఒక విధిని నిర్దేశించింది. ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించదగిన నేరాల్లో, అరెస్టు చేయడానికి గల కారణాలను అలాగే అరెస్టు చేయకపోవడానికి గల కారణాలను పోలీసులు తప్పక నమోదు చేయాలి.
  • వాక్యం 3 తప్పు: కస్టోడియల్ మరణం, అదృశ్యం లేదా కస్టడీలో అత్యాచారం జరిగిన కేసుల్లో సెక్షన్ 176 CrPC మేజిస్టీరియల్ విచారణను (Magisterial inquiry) తప్పనిసరి చేస్తుంది. ఈ విచారణను జ్యుడీషియల్ లేదా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నిర్వహిస్తారు, పోలీసు అధికారి కాదు. కస్టోడియల్ కేసుల్లో స్వతంత్ర దర్యాప్తు జరిగేలా ఇది నిర్ధారిస్తుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ప్ర1. కస్టోడియల్ మరణాల కేసుల్లో ఆర్టికల్ 21 ఎందుకు ముఖ్యమైనది?

జ: ఇది ప్రాణానికి, గౌరవానికి హామీ ఇస్తుంది మరియు ఏకపక్ష ప్రభుత్వ చర్యల (arbitrary state action) నుండి రక్షణ కల్పిస్తుంది.

ప్ర2. కస్టోడియల్ మరణాల వెనుక ఉన్న ప్రధాన సమస్య ఏమిటి?

జ: పోలీసుల బలవంతపు పద్ధతుల (coercive policing) పై ఆధారపడటం మరియు జవాబుదారీతనం లేకపోవడం.

ప్ర3. ఏ సంస్కరణ అత్యంత అవసరం?

జ: బలమైన హింస వ్యతిరేక చట్టం (anti-torture law) మరియు పోలీసు సంస్కరణలు.

ప్ర4. కస్టోడియల్ హింసకు వ్యతిరేకంగా రాజ్యాంగ రక్షణ ఏ నిబంధనల నుండి వస్తుంది?

జ: కస్టోడియల్ హింసకు వ్యతిరేకంగా రక్షణ ప్రధానంగా కింది వాటి నుండి వస్తుంది:

  • ఆర్టికల్ 21 – జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ.
  • ఆర్టికల్ 20(3) – స్వయంగా నేరం అంగీకరించకుండా రక్షణ (Protection against self-incrimination).
  • ఆర్టికల్ 22 – ఏకపక్ష అరెస్టు మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణలు.

ప్ర5. నేర శిక్షాస్మృతి (CrPC), 1973 లోని సెక్షన్ 41 ఏ రక్షణ కల్పిస్తుంది?

జ: సెక్షన్ 41 వారెంట్ లేకుండా అరెస్టు చేసే పోలీసు అధికారాన్ని నియంత్రిస్తుంది. కొన్ని కేసుల్లో అరెస్టు చేయడానికి లేదా అరెస్టు చేయకపోవడానికి కారణాలను పోలీసులు తప్పనిసరిగా రికార్డ్ చేయాలని నిర్దేశిస్తుంది.

మూలం: ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (Indian Express)

ప్రాముఖ్యత: జనరల్ స్టడీస్ పేపర్ II – పాలన (Governance), జనరల్ స్టడీస్ పేపర్ III – ఆర్థిక వ్యవస్థ (Economy)

ప్రిలిమ్స్, మెయిన్స్ కోసం ముఖ్యమైన పదాలు (Important Keywords)

ప్రిలిమ్స్ కోసం:

  • నేరాల జాబితా నుంచి తొలగింపు (Decriminalization), తీర్పునిచ్చే అధికారి (Adjudicating Officer), నియంత్రణ జరిమానా (Regulatory Penalty), సివిల్ బాధ్యత (Civil Liability), నేరాల రాజీ (Compounding of Offences).

మెయిన్స్ కోసం:

  • విశ్వాస-ఆధారిత పాలన (Trust-based governance), వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం (Ease of Doing Business), దామాషా నియంత్రణ (Proportional regulation), నియంత్రణల క్రమబద్ధీకరణ (Regulatory rationalisation), పరిపాలనాపరమైన తీర్పు (Administrative adjudication), కోర్టు కేసుల భారం తగ్గింపు (Judicial backlog reduction), చట్టపరమైన భారం (Compliance burden), పెట్టుబడిదారుల విశ్వాసం (Investor confidence).

వార్తల్లో ఎందుకు ఉంది? (Why in News?)

  • చిన్న తప్పులను నేరాల జాబితా నుంచి తొలగించడానికి (Decriminalising) ఉద్దేశించిన ‘జన్ విశ్వాస్ 2.0’ (Jan Vishwas (Amendment of Provisions) Bill, 2026) కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇది గతంలో తెచ్చిన సంస్కరణల పరిధిని మరింత పెంచింది.
  • ఈ బిల్లు ద్వారా దాదాపు 79 కేంద్ర చట్టాలను (Central Acts) సవరించి, 700 కు పైగా నిబంధనలను నేరాల జాబితా నుంచి తొలగించారు. భారతదేశ చట్టాల చరిత్రలో ఇదొక అతిపెద్ద సంస్కరణ (Compliance reform).
  • కోర్టులపై ఉన్న అనవసర భారాన్ని తగ్గించడం, అదే సమయంలో వ్యాపారులకు, ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEs) మెరుగైన వాతావరణం కల్పించడం దీని లక్ష్యం.
  • శిక్షలతో భయపెట్టే (Punitive enforcement) పాలనా విధానం నుంచి, ప్రజల పట్ల విశ్వాసంతో చట్టాలను అమలు చేసే (Trust-based compliance) విధానం వైపు ప్రభుత్వ ఆలోచనల్లో వచ్చిన మార్పును ఈ సంస్కరణ సూచిస్తోంది.

నేపథ్యం, సందర్భం (Background and Context)

  • 42 కేంద్ర చట్టాలను సవరించి, చిన్న తప్పులకు జైలు శిక్షను తొలగించడం ద్వారా ‘జన్ విశ్వాస్ చట్టం, 2023’ (Original Jan Vishwas Act, 2023) ఈ సంస్కరణల ప్రక్రియను ప్రారంభించింది.
  • అయితే, నియంత్రణల విషయంలో అస్పష్టత, గత కేసుల (Retrospective) విషయంలో జరిమానాలు, సంక్లిష్టమైన విధానాలపై అప్పట్లో కొన్ని ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
  • చారిత్రకంగా చూస్తే, చిన్న చిన్న సాంకేతిక లోపాలకు (Technical lapses) కూడా క్రిమినల్ కేసులు పెట్టడం భారతదేశ చట్టాల విధానంలో ఒక భాగమైపోయింది. ఇది కొత్త వ్యాపారాలను (Entrepreneurship) నిరుత్సాహపరుస్తోంది.
  • అందుకే శిక్షలను హేతుబద్ధం చేయడానికి, వ్యాపార నిర్వహణను (Ease of doing business) సులభతరం చేయడానికి మరింత విస్తృతమైన సంస్కరణల అవసరం ఏర్పడింది.
  • విధాన నిర్ణేతలు (Policymakers), పారిశ్రామికవర్గాలు (Industry) ఎత్తిచూపిన లోపాలను సవరిస్తూ, చట్టాల పరిధిని మరింత విస్తరిస్తూ జన్ విశ్వాస్ 2.0 (Jan Vishwas 2.0) బిల్లును తీసుకువచ్చారు.

సంస్కరణ స్వభావం, భావన (Nature and Concept of Reform)

  • “ప్రభుత్వమే శాసించి, నియంత్రించే (Command-and-control)” పాత మోడల్ నుంచి, “విశ్వాస-ఆధారిత పాలన (Trust-based governance)” వైపు మారుతున్న విధానాన్ని జన్ విశ్వాస్ 2.0 స్పష్టం చేస్తోంది.
  • అన్ని ఉల్లంఘనలకు క్రిమినల్ కేసులు (Criminal prosecution) అవసరం లేదని ఈ బిల్లు గుర్తించింది. ముఖ్యంగా ఉద్దేశపూర్వకంగా చేయని (Non-malicious), కేవలం విధానపరమైన (Procedural) తప్పులకు ఇది వర్తిస్తుంది.
  • నేర తీవ్రతను బట్టి జరిమానా ఉండే “దామాషా నియంత్రణ” (Principle of proportionality) విధానాన్ని ఈ సంస్కరణ పరిచయం చేసింది.
  • జైలు శిక్షల భయాన్ని తగ్గించడం ద్వారా స్వచ్ఛందంగా తప్పును సరిదిద్దుకోవడాన్ని (Corrective behaviour) ఇది ప్రోత్సహిస్తుంది.
  • భారతదేశ నియంత్రణ విధానాలను, ప్రపంచ స్థాయి ఆధునిక పాలన (Modern governance), ఆర్థిక సామర్థ్య (Economic efficiency) ప్రమాణాలతో ఈ విధానం సమానం చేస్తుంది.

ముఖ్యమైన నిబంధనలు, లక్షణాలు (Key Provisions and Features)

  • ఈ బిల్లు 79 కేంద్ర చట్టాల్లోని 717 నిబంధనలను సవరించింది. చిన్న తప్పులకు జైలు శిక్షలను రద్దు చేసి, వాటి స్థానంలో జరిమానాలు (Monetary penalties), పరిపాలనా ఆంక్షలు (Administrative sanctions) విధించింది.
  • ఏకపక్షంగా భారీ శిక్షలు వేయకుండా (Graded enforcement), తప్పుల స్థాయిని బట్టి ముందుగా హెచ్చరించడం (Warnings) లేదా తక్కువ జరిమానాలు వేసే విధానాన్ని ఇది తీసుకువచ్చింది.
  • కోర్టుల ప్రమేయం లేకుండా, ఒక తీర్పు యంత్రాంగం (Adjudication-based mechanism) ద్వారా అధికారులే నేరుగా సమస్యలను పరిష్కరించే మార్పును ఇది సూచిస్తుంది.
  • జరిమానాలు విధించే అధికారం తీర్పునిచ్చే అధికారులకు (Adjudicating officers) ఇవ్వబడింది. న్యాయంగా, జవాబుదారీగా ఉండటానికి ఒక అప్పీల్ యంత్రాంగం (Appellate mechanism) కూడా దీనికి తోడుగా ఉంటుంది.
  • పాత కేసుల (Retrospective cases) విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై స్పష్టతనిచ్చింది. అదే సమయంలో ప్రజా భద్రత (Public safety), పర్యావరణ పరిరక్షణ (Environmental protection), ఆర్థిక మోసాలకు (Fraud) సంబంధించిన తీవ్రమైన నేరాలకు మాత్రం కఠిన శిక్షలు (Stringent penalties) కొనసాగుతాయని బిల్లు స్పష్టం చేసింది.
  • మొత్తమ్మీద, చిన్న తప్పులకు, పెద్ద నేరాలకు (Minor and major violations) మధ్య వ్యత్యాసాన్ని చూపే ఒక విభిన్నమైన చట్రాన్ని (Differentiated framework) ఇది సృష్టిస్తుంది.

పాలనాపరమైన, ఆర్థిక ప్రాముఖ్యత (Governance and Economic Significance)

  • చిన్న విధానపరమైన లోపాలకు కూడా క్రిమినల్ కేసులు పెడతారన్న భయాన్ని పోగొట్టడం ద్వారా, ఈ సంస్కరణ వ్యాపారులపై, ముఖ్యంగా MSME లపై చట్టపరమైన భారాన్ని (Compliance burden) గణనీయంగా తగ్గిస్తుంది.
  • స్పష్టమైన, హేతుబద్ధమైన చట్టపరమైన వాతావరణాన్ని (Predictable regulatory environment) సృష్టించడం ద్వారా ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని (Investor confidence) పెంచుతుంది.
  • చిన్న కేసులను కోర్టుల పరిధి నుంచి తప్పించడం ద్వారా, కోర్టుల్లో పేరుకుపోయిన కేసుల భారాన్ని (Judicial backlog) తగ్గించడంలో, న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని (Efficiency) మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.
  • పాలనాపరంగా చూస్తే.. పౌరులకు జవాబుదారీగా ఉంటూనే, ఆర్థిక వృద్ధికి (Economic growth) ప్రాధాన్యతనిచ్చే సౌకర్యవంతమైన రాజ్యంగా (Facilitative state) మారుతున్న పరిణామాన్ని ఇది సూచిస్తుంది.
  • ప్రపంచ బ్యాంకుకు చెందిన B-READY ఫ్రేమ్‌వర్క్ (World Bank’s Business Ready) లాంటి గ్లోబల్ ప్రమాణాలకు అనుగుణంగా, భారతదేశంలో వ్యాపార వాతావరణాన్ని (Business climate) మెరుగుపరచడానికి చేస్తున్న విస్తృత ఆర్థిక సంస్కరణలతో ఈ బిల్లు కలిసిపోతుంది.

సమస్యలు, ఆందోళనలు (Issues and Concerns)

  • ఈ బిల్లులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, నిబంధనల అమలు, జవాబుదారీతనం (Regulatory enforcement and accountability) విషయంలో కొన్ని ఆందోళనలు ఉన్నాయి.
  • జైలు శిక్షలు లేకుండా కేవలం జరిమానాలు విధిస్తే, కంపెనీలు ఆ జరిమానాలను కూడా “వ్యాపార ఖర్చు” (Cost of doing business) గానే పరిగణించి, యధేచ్ఛగా తప్పులు చేసే ప్రమాదం ఉంది. దీనివల్ల చట్టం పట్ల భయం (Deterrence) తగ్గిపోతుంది.
  • పాలనాపరమైన పరిష్కారాల (Administrative adjudication) వైపు మారడం మంచిదే అయినప్పటికీ, తీర్పునిచ్చే అధికారులకు సరైన సామర్థ్యం, స్వాతంత్ర్యం (Independence) లేకపోతే తీర్పుల్లో అస్థిరత (Inconsistencies) వచ్చే ప్రమాదం ఉంది.
  • పరిశ్రమలకు, నియంత్రణా సంస్థలకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల నిబంధనల అమలు (Enforcement) బలహీనపడే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు (దీనినే Regulatory capture అంటారు).
  • అలాగే, అన్ని రంగాలు, అన్ని రాష్ట్రాల్లో ఈ చట్టాలను ఒకేలా అమలు చేయకపోతే (Uniform implementation) ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది.
  • అందువల్ల, నేరాలను తొలగించడం వ్యాపార నిర్వహణను సులభతరం చేసినప్పటికీ, దానికి ధీటుగా పటిష్టమైన పర్యవేక్షణా యంత్రాంగం (Effective oversight mechanisms) కూడా అంతే అవసరం.

ముందున్న మార్గం (Way Forward)

  • ‘జన్ విశ్వాస్ 2.0’ ని సమర్థవంతంగా అమలు చేయడానికి సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయాలి. పరిపాలనాపరమైన తీర్పుల్లో (Adjudication processes) పారదర్శకతను (Transparency) పెంచాలి.
  • అన్ని రంగాల్లో జరిమానాలు ఒకేలా ఉండేలా ప్రామాణిక మార్గదర్శకాలను (Standardised guidelines) రూపొందించాలి. నేరాల తొలగింపు (Decriminalisation) ప్రభావాన్ని అంచనా వేయడానికి ఎప్పటికప్పుడు మదింపు చేసే యంత్రాంగాలను (Monitoring mechanisms) ఏర్పాటు చేయాలి.
  • అదే సమయంలో, ప్రజా భద్రత, పర్యావరణ నష్టం, ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసుల్లో కఠిన చట్టాలను (Strict enforcement) కొనసాగించాలి.
  • నియంత్రణ సంస్థల అధికారులకు సరైన శిక్షణ ఇవ్వడం, నిబంధనల అమలులో డిజిటలైజేషన్ (Digitalisation) తీసుకురావడం ద్వారా ఈ వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత పెంచవచ్చు.
  • “విశ్వాస ఆధారిత పాలన” (Trust-based governance) పేరుతో చట్టాల అమలులో ఏమాత్రం రాజీపడకుండా సమతుల్యమైన విధానాన్ని (Balanced approach) అవలంబించడం చాలా ముఖ్యం.

ముగింపు (Conclusion)

విశ్వాస ఆధారిత సమ్మతిని (Trust-based compliance), దామాషా విధానాన్ని (Proportional enforcement) ప్రోత్సహించడం ద్వారా భారతదేశ నియంత్రణ వ్యవస్థను (Regulatory framework) ఆధునీకరించే దిశగా జన్ విశ్వాస్ 2.0 వేసిన అతిపెద్ద అడుగు. శిక్షలతో భయపెట్టే పాత విధానం నుంచి, ఆర్థిక వృద్ధికి మద్దతు ఇస్తూ కోర్టుల భారాన్ని తగ్గించే ఒక సౌకర్యవంతమైన నమూనాకు (Facilitative model) పాలనా వ్యవస్థ మారుతోందని ఇది ప్రతిబింబిస్తోంది. అయితే, దీని దీర్ఘకాలిక విజయం అనేది వ్యాపార సౌలభ్యానికి (Ease of doing business), సమర్థవంతమైన పర్యవేక్షణకు (Effective regulatory oversight) మధ్య సమతుల్యత పాటించడంపైనే ఆధారపడి ఉంటుంది.

యూపీఎస్సీ గత సంవత్సర ప్రశ్న (UPSC PYQ)

ప్ర. భారతదేశంలో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ను (వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం) మెరుగుపరచడంలో నియంత్రణ సంస్కరణల (Regulatory reforms) పాత్రను చర్చించండి. (250 పదాలు)

కేర్ (CARE) బహుళైచ్ఛిక ప్రశ్నలు (MCQs)

ప్రశ్న 1: జన్ విశ్వాస్ 2.0 కి సంబంధించి, కింది వాక్యాలను పరిశీలించండి:

  1. ఇది చిన్న తప్పులకు జైలు శిక్షను రద్దు చేసి, వాటి స్థానంలో జరిమానాలను (Civil penalties) ప్రవేశపెడుతుంది.
  2. ఇది చట్టాల అమలును కోర్టుల నుంచి పరిపాలనా అధికారులకు (Administrative authorities) మారుస్తుంది.
  3. ప్రజా భద్రతకు భంగం కలిగించే తీవ్రమైన నేరాలకు కూడా ఇది శిక్షలను పూర్తిగా తొలగిస్తుంది.

పై వాక్యాలలో ఏవి సరైనవి?

A. 1, 2 మాత్రమే

B. 2, 3 మాత్రమే

C. 1, 3 మాత్రమే

D. 1, 2, 3

జవాబు: A

వివరణ:

  • 1వ వాక్యం సరైనది: అనేక కేంద్ర చట్టాల్లోని చిన్న, విధానపరమైన తప్పులను నేరాల జాబితా నుంచి తొలగించడానికి (Decriminalising) 2023 లో ప్రారంభించిన సంస్కరణలను ‘జన్ విశ్వాస్ 2.0’ కొనసాగిస్తోంది. జైలు శిక్షకు బదులుగా.. ఇప్పుడు ఇలాంటి ఉల్లంఘనలకు జరిమానాలు, హెచ్చరికలు లేదా పరిపాలనాపరమైన ఆంక్షలు విధిస్తారు. ఇది దామాషా నియంత్రణ (Proportionality) సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే చిన్న సాంకేతిక లోపాలను క్రిమినల్ నేరాలుగా చూడరు. ముఖ్యంగా వ్యాపారాలకు, MSME లకు చట్టాల పట్ల భయాన్ని తగ్గించడం, వారు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించేలా (Voluntary compliance) ప్రోత్సహించడం దీని ఉద్దేశం.
  • 2వ వాక్యం సరైనది: జన్ విశ్వాస్ 2.0 లోని ఒక కీలకమైన నిర్మాణాత్మక మార్పు ఏమిటంటే, చట్టాల అమలును కోర్టుల (Judicial enforcement) నుంచి పరిపాలనా తీర్పుల (Administrative adjudication) పరిధిలోకి మార్చడం. గతంలో, చిన్న తప్పులను కూడా క్రిమినల్ కోర్టుల్లో విచారించేవారు. దీనివల్ల కేసులు పేరుకుపోయాయి. ఇప్పుడు, ఇలాంటి కేసులను తీర్పునిచ్చే అధికారులు (Adjudicating officers – ఎగ్జిక్యూటివ్ అథారిటీలు) నిర్వహిస్తారు. వారు నేరుగా జరిమానాలు విధించవచ్చు. దీనివల్ల:
    • కేసులు త్వరగా పరిష్కారమవుతాయి
    • న్యాయ వ్యవస్థపై భారం తగ్గుతుంది
    • నియంత్రణల అమలులో దక్షత (Efficiency) పెరుగుతుంది. ఈ విధంగా, ఈ సంస్కరణ వ్యాపార నిర్వహణను, న్యాయపరమైన దక్షతను (Judicial efficiency) రెండింటినీ సమర్థిస్తుంది.
  • 3వ వాక్యం తప్పు: ఈ సంస్కరణ తీవ్రమైన నేరాలకు శిక్షలను తొలగించదు. ప్రజా భద్రత, పర్యావరణ రక్షణ, ఆర్థిక మోసాలు (Financial fraud) లేదా జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన తీవ్రమైన నేరాలకు జైలు శిక్షతో సహా కఠినమైన శిక్షలు (Strict penalties) కొనసాగుతాయి. జన్ విశ్వాస్ 2.0 అనేది ఎంపిక చేసిన నేరాలను (Selective decriminalisation) మాత్రమే తొలగిస్తుంది, మొత్తం అన్ని శిక్షలను రద్దు చేయదు. దీని ప్రధాన లక్ష్యం.. చిన్న విధానపరమైన ఉల్లంఘనలకు (జరిమానాలు), తీవ్రమైన నేరాలకు (క్రిమినల్ శిక్ష కొనసాగింపు) మధ్య వ్యత్యాసం చూపించడమే.

ప్రశ్న 2: జన్ విశ్వాస్ సంస్కరణలకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి:

  1. వ్యాపారాలపై చట్టపరమైన భారాన్ని (Compliance burden) తగ్గించడమే ఈ సంస్కరణల లక్ష్యం.
  2. ఇవి కోర్టుల్లో పెండింగ్ కేసుల భారాన్ని (Judicial backlog) తగ్గించడానికి దోహదం చేస్తాయి.
  3. ఆర్థిక చట్టాలలో క్రిమినల్ బాధ్యతను (Criminal liability) ఇవి పూర్తిగా రద్దు చేస్తాయి.

సమాధానం: A (1, 2 మాత్రమే)

వివరణ:

  • 1వ వాక్యం సరైనది: చిన్న విధానపరమైన ఉల్లంఘనలకు జైలు శిక్షను తొలగించడం ద్వారా, ముఖ్యంగా MSME లు, స్టార్టప్‌లకు చట్టపరమైన భారాన్ని తగ్గించడానికే జన్ విశ్వాస్ 2.0 ని ప్రత్యేకంగా రూపొందించారు. గతంలో, ఫైలింగ్ ఆలస్యం కావడం లేదా చిన్న డాక్యుమెంటేషన్ తప్పులు లాంటి సాంకేతిక లోపాలకు కూడా క్రిమినల్ కేసులు పెట్టేవారు. దీనివల్ల వ్యాపారుల్లో ఎప్పుడూ “జైలు భయం” ఉండేది. అలాంటి నిబంధనల స్థానంలో జరిమానాలు, హెచ్చరికలు తీసుకురావడం ద్వారా.. వ్యాపార నిర్వహణను, స్వచ్ఛంద సమ్మతిని (Voluntary compliance), ఆర్థిక వ్యవస్థ ఫార్మలైజేషన్‌ను (Formalisation of the economy) ఈ సంస్కరణ ప్రోత్సహిస్తుంది.
  • 2వ వాక్యం సరైనది: భారతదేశ పాలనలో ప్రధాన సమస్య అయిన కోర్టు పెండింగ్ కేసులను (Judicial backlog) తగ్గించడంలో ఈ సంస్కరణ విశేషంగా దోహదపడుతుంది. గతంలో పెద్ద సంఖ్యలో చిన్న నియంత్రణ నేరాలను క్రిమినల్ కోర్టుల ద్వారా విచారించేవారు, దీంతో అనవసరంగా కేసులు పేరుకుపోయాయి. జన్ విశ్వాస్ 2.0 పరిపాలనా తీర్పు యంత్రాంగాన్ని (Administrative adjudication mechanism) తీసుకువస్తుంది, ఇక్కడ తీర్పునిచ్చే అధికారులే ఇటువంటి కేసులను నిర్వహిస్తారు. ఇది వివాదాలను వేగంగా పరిష్కరిస్తుంది. పెండింగ్ కేసులను (Pendency) తగ్గిస్తుంది. తీవ్రమైన క్రిమినల్, రాజ్యాంగపరమైన విషయాలపై దృష్టి పెట్టడానికి కోర్టులకు సమయం ఇస్తుంది.
  • 3వ వాక్యం తప్పు: ఆర్థిక లేదా నియంత్రణ చట్టాలలో (Economic or regulatory laws) క్రిమినల్ బాధ్యతను ఈ సంస్కరణ పూర్తిగా తొలగించదు. ప్రజా భద్రత, పర్యావరణ నష్టం, మోసం, జాతీయ భద్రత లేదా ఆర్థిక దుష్ప్రవర్తనకు సంబంధించిన తీవ్రమైన నేరాలకు జైలు శిక్షతో సహా కఠినమైన క్రిమినల్ శిక్షలు కొనసాగుతాయి. కాబట్టి, ఈ సంస్కరణ దామాషా నియంత్రణ (Proportionality) సూత్రంపై ఆధారపడి ఉందే తప్ప, పూర్తిగా నేరాలను రద్దు (Blanket decriminalisation) చేయదు.

ప్రశ్న 3: నియంత్రణ సంస్కరణల నేపథ్యంలో, “తీర్పునిచ్చే అధికారుల” (Adjudicating Officers) ప్రాథమిక పాత్ర ఏమిటి? A) కేంద్ర, రాష్ట్రాల మధ్య రాజ్యాంగపరమైన వివాదాలను విచారించడం.

B) నిబంధనల ఉల్లంఘన కేసులను పరిశీలించి జరిమానాలు విధించడం లేదా తప్పు సరిదిద్దుకోవాలని ఆదేశించడం.

C) క్రిమినల్ కోర్టులు ఇచ్చిన తీర్పులను సమీక్షించడం.

D) పార్లమెంటరీ చట్టాలకు సవరణలు సూచించడం.

జవాబు: B

వివరణ:

జన్ విశ్వాస్ లాంటి సంస్కరణల కింద తీర్పునిచ్చే అధికారులు (Adjudicating Officers) ఒక ముఖ్యమైన సంస్థాగత యంత్రాంగం. క్రిమినల్ కోర్టులపై ఆధారపడకుండా చిన్న ఉల్లంఘనలను అధికారుల ద్వారానే పరిష్కరించడం వీరి ప్రధాన పాత్ర. వీరి ముఖ్యమైన విధులు:

  • వివిధ చట్టాల కింద నిబంధనల ఉల్లంఘన (Non-compliance) కేసులను పరిశీలించడం.
  • జరిమానాలు (Monetary penalties) విధించడం.
  • హెచ్చరికలు జారీ చేయడం లేదా తప్పు సరిదిద్దుకోవాలని ఆదేశించడం.
  • చిన్న నేరాలను నిర్ణీత సమయంలోగా (Time-bound) పరిష్కరించడం. ప్రాముఖ్యత: ఇది న్యాయ/క్రిమినల్ అమలు (Judicial / Criminal enforcement) నుండి పరిపాలనా/కార్యనిర్వాహక అమలు (Administrative / Executive enforcement) కి మారుతున్న విధానాన్ని ప్రతిబింబిస్తుంది. పాలనాపరమైన ప్రయోజనాలు:
  • కోర్టులపై భారాన్ని తగ్గిస్తుంది.
  • వేగం, దక్షత (Efficiency) పెరుగుతుంది.
  • నైపుణ్యంతో కూడిన నిర్ణయాలను (Specialised decision-making) ప్రోత్సహిస్తుంది.

ప్రశ్న 4: జన్ విశ్వాస్ 2.0 వల్ల భవిష్యత్తులో వచ్చే ఆందోళనలకు సంబంధించి, కింది వాక్యాలను పరిశీలించండి:

  1. ఇది ‘రెగ్యులేటరీ క్యాప్చర్’ (Regulatory capture) కు దారితీయవచ్చు. అంటే, నియంత్రణ సంస్థల అధికారులే తాము పర్యవేక్షించే పరిశ్రమలకు అనుకూలంగా వ్యవహరించే ప్రమాదం ఉంది.
  2. జైలు శిక్షల స్థానంలో జరిమానాలు విధించడం వల్ల కొన్ని కేసులలో చట్టం పట్ల భయం (Deterrence) తగ్గిపోవచ్చు.
  3. దీనివల్ల చిన్న నేరాలను కూడా క్రిమినల్ కేసులుగా (Criminalisation) పరిగణించే అవకాశం పెరుగుతుంది.

పై వాక్యాలలో ఏవి సరైనవి?

A) 1, 2 మాత్రమే

B) 2, 3 మాత్రమే

C) 1, 3 మాత్రమే

D) 1, 2, 3

జవాబు: A (1, 2 మాత్రమే)

వివరణ:

  • 1వ వాక్యం సరైనది: చట్టాల అమలును అధికారులకు (Executive authorities) అప్పగించినప్పుడు, వారు పరిశ్రమలతో సన్నిహితంగా ఉండటం వల్ల రెగ్యులేటరీ క్యాప్చర్ (Regulatory capture) జరిగే ప్రమాదం ఉంది.
  • 2వ వాక్యం సరైనది: పెద్ద పెద్ద కంపెనీలు ఈ జరిమానాలను కూడా వ్యాపార నిర్వహణలో ఒక ఖర్చుగా (Cost of doing business) భావిస్తే, చట్టం పట్ల భయం (Deterrence) తగ్గే ప్రమాదం ఉంది.
  • 3వ వాక్యం తప్పు: చిన్న నేరాలను క్రిమినల్ జాబితా నుంచి తొలగించడమే (Decriminalisation) ఈ సంస్కరణ లక్ష్యం. దీనివల్ల క్రిమినల్ కేసులు తగ్గుతాయి, పెరగవు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ప్ర1. జన్ విశ్వాస్ 2.0 ప్రధాన లక్ష్యం ఏమిటి?

జ: చిన్న తప్పులను నేరాల జాబితా నుంచి తొలగించడం, చట్టపరమైన భారాన్ని తగ్గించడం ద్వారా విశ్వాస ఆధారిత సమ్మతిని (Trust-based compliance) ప్రోత్సహించడం.

ప్ర2. ఇది ఆర్థిక వ్యవస్థకు ఎలా సహాయపడుతుంది?

జ: వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం (Ease of doing business), పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడం, కోర్టు కేసులను తగ్గించడం ద్వారా ఇది ఆర్థిక వ్యవస్థకు సహాయపడుతుంది.

ప్ర3. దీనిపై ఉన్న ప్రధాన ఆందోళన ఏమిటి?

జ: చట్టం పట్ల భయం తగ్గిపోవడం (Weakening of deterrence), అలాగే నియంత్రణ సంస్థల అధికారులు నిబంధనలను ఒకేలా అమలు చేయకపోవడం.

ప్ర4. నియంత్రణ పాలనలో (Regulatory governance) నేరాల జాబితా నుంచి తొలగించడం (Decriminalisation) అంటే ఏమిటి?

జ: చిన్న లేదా విధానపరమైన ఉల్లంఘనలకు జైలు శిక్ష లాంటి క్రిమినల్ శిక్షలను తొలగించి, వాటి స్థానంలో జరిమానాలు, హెచ్చరికలు లేదా పరిపాలనాపరమైన ఆంక్షలు విధించడాన్ని డిక్రిమినలైజేషన్ అంటారు.

ప్ర5. 2023 చట్టానికి, జన్ విశ్వాస్ 2.0 కి మధ్య తేడా ఏమిటి?

జ: 2023 చట్టం సుమారు 42 కేంద్ర చట్టాలను సవరించగా, జన్ విశ్వాస్ 2.0 ఈ సంస్కరణను దాదాపు 79 చట్టాలకు విస్తరించింది. అంతేకాకుండా పాత కేసుల్లో జరిమానాలు (Retrospective penalties), నియంత్రణల్లో ఉన్న అస్థిరతలు లాంటి లోపాలను ఇది సరిదిద్దింది.

మూలం: ఇండియన్ ఎక్స్‌ప్రెస్

Enroll Now for Unlimited UPSC Utsav

Start Date

22/03/2026

Timings

08 AM – 4 PM

    Scroll to Top